స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. జిల్లాలోని మునిసిపల్ కార్యాలయం ముందు మహిళ దారుణ హత్యకు గురైంది. టూ వీలర్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్వప్న శ్రీ అనే మహిళను కత్తితో నరికారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. నిందితులు TS19E7695 బైక్ పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు స్వప్నకు రెండో భర్తతో భూవివాదం తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోటపల్లి మండలంలో ఉన్న భూమి విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న స్థానిక సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, మహిళపై గల దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.


