27.2 C
Hyderabad
Friday, December 8, 2023
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నేడు విడుదల కానున్న జూన్ నెల టిక్కెట్లు

Tirumala Updates: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉదయం 11 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. స్వామి వారి కైంకర్యాల దృష్ట్యా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధనను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇవాళ తిరుమలలో ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేస్తారు అధికారులు. అలాగే.. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 62,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 21,718 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Latest Articles

‘తంత్ర’ టీజర్ లాంచ్ చేసిన ప్రియదర్శి

మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర '. ఈ మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్