29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నేడు విడుదల కానున్న జూన్ నెల టిక్కెట్లు

Tirumala Updates: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉదయం 11 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభించనున్నారు. స్వామి వారి కైంకర్యాల దృష్ట్యా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధనను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇవాళ తిరుమలలో ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేస్తారు అధికారులు. అలాగే.. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 62,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 21,718 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్