24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఒక వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 11 నివాసిస్తున్న మహేంద్ర శర్మ.. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తోటి ఆటగాళ్లతో కలిసి శర్మ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. నోయిడా స్టేడియంలోని అత్యవసర వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శర్మను బతికించేందుకు పీసీఆర్‌ చేశారు. అనంతరం అతన్ని హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఐతే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇండోర్ స్టేడియంలో కుప్పకూలిన శర్మకు వైద్యులు పీసీఆర్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ ఆఫీసర్ అమిత్ కుమార్ మీడియాకు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్