స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబసభ్యులతో పాటు లోకేశ్ చిన్ననాటి స్నేహితులందరూ పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనగసాగుతోంది. ఈ సందర్భంగా మోతుకూరు గ్రామం వద్ద 100వ రోజు ఫైలాన్ లోకేశ్ ఆవిష్కరించనున్నారు. మరోవైపు లోకేశ్ కు సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన మహా పాదయాత్ర 34 నియోజకవర్గాల్లో మొత్తం 1268 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.