నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావే శం జరిగింది. దీనికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఆమె తండ్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. అనం తరం పాములపాడు హైస్కూల్ నుంచి బస్స్టాప్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులు, యువతకు మేలు చేసింది లేదని విమర్శించారు. రైతులు దేవుళ్ళ లాంటి వాళ్ళని..అలాంటి వాళ్ళను ప్రస్తుత ఎంపీ బ్రహ్మనంద రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఇక రియల్ ఎస్టేట్ వాళ్లు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడ దని ధ్వజమెత్తారు.