ఏపీలో అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె విరమించి విధుల్లోకి రావా లని ఇప్పటికే ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అయినా సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వం ఎస్మాప్రయోగించింది. సమ్మె చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఎస్మా చట్టం ప్రయోగిం చి ఉక్కుపాదం మోపింది.. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసన లు నిషేధమంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.2 విడుదల చేసింది. అంగ న్వాడీలు గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించిం ది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేత నం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది.
ఎస్మా చట్టం అంటే ఏమిటి?
ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడేది ఎస్మా చట్టం. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కు సంక్షిప్త రూపమే ఎస్మా..వైద్యం, ప్రజారవాణా తదితర అత్యవసర సేవలకు సంబంధించిన రంగాలలోని సిబ్బంది సమ్మెల దర్నాలు చేస్తూ విధులకు హాజరుకాకపోతే ప్రభు త్వం ఈ చట్టం ప్రయోగిస్తుంది.


