Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

వైసీపీ నేతల్లో గందరగోళం …. ఇక మార్పుల్లేవంటూ అధిష్టానం సంకేతం

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీకి… ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున తలనొప్పి కలిగిస్తున్నాయా…? అందులో భాగంగానే వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చూడాలా ? నియోజకవర్గాల బాధ్యుల విషయంలో పార్టీ పరంగా రాబోయే రోజుల్లో పెద్ద మార్పులేమీ ఉండబోవని ఆయన వ్యాఖ్యా నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? ఇప్పటికే పలు చోట్ల సిట్టింగ్‌లు, ఆశావహాలు కొందరు ఫ్యాను గాలి నుంచి పక్కకు వెళ్లిపోయారు. మరికొందరు తమకు అధిష్టానం చెక్‌ పెడితే కండువా మార్చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యం లోనే అన్నీ ఆలోచించి జగన్‌ ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న దానికి వైవీ వ్యాఖ్యలే నిదర్శ నమా ? లేక మరేదైనా వ్యూహం దాగుందా ?

      వైనాట్ 175, సిద్ధం అంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమర శంఖం మోగించింది వైసీపీ. పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచడంతోపాటు, ప్రజలకు ప్రభుత్వం తరఫున జరిగిన మేలును గుర్తు చేయడం, సర్కారు పథకాలు అందిన విధానంపై వారిని చైతన్య పరిచి మళ్లీ రానున్న ఎన్నికల్లో వారితో వైసీపీకే ఓటు వేసేలా చూడడం లాంటి వాటిపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోవైపు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ వెళుతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఇప్పటికే 14 ఎంపీ, 61 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చి వేశారు. మరికొందర్నీ త్వరలోనే మారుస్తారన్న ప్రచారం ఓవైపు సాగుతోంది. ఇలాంటి వేళ.. పార్టీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే చాలా మందిని సీఎం జగన్ మార్చేశారని… రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు సుబ్బారెడ్డి. దీంతో.. ఇప్పుడు వైవీ చేసిన కామెంట్లపైనే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని జాబితాల విడుదల ఏ క్షణమైనా ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఎందుకిలా వ్యాఖ్యానించారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.

        వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే విడుదల చేసిన జాబితాల్లో జరిగిన ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు… వాటి పర్యవసానంగా ఎదురవుతున్న సమస్యలను గత కొంత కాలంగా పలువురు నేతలు అధిష్టా నం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని దాని వల్లే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారని చెబుతున్నారు. ప్రధానంగా కొంత మంది ఎంపీల విషయంలో జరిగిన చర్చను ఈ సందర్భంగా హైలెట్ చేస్తున్నారు. కొందరికి ఇష్టం లేకపోయినా అంటే ఉదాహరణకు తిరుపతి ఎంపీ సీటు లాంటి చోట ఎమ్మెల్యే ఆదిమూలంకు ఇష్టం లేకపోయినా పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పడంతో ఆయన పార్టీని వీడారు. దీంతో.. గురుమూర్తిని మళ్లీ వెనక్కు పంపించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదన్న వాదన వైసీపీ వర్గాల నుంచి బలంగా విన్పిస్తోంది.

        ఒంగోలు ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్‌గా ఉన్న మాగుంటకు మళ్లీ సీటు ఇచ్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు సీఎం జగన్. దీంతో.. అప్పట్నుంచి గొడవ మొదలైందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంటకు ఇవ్వాలంటూ జగన్ బంధువు.. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పట్టుపట్టడంతో సమస్య మరింత జఠిలమైంది. పీట ముడి పడింది. ఇక, అప్పట్నుంచి చోటు చేసుకున్న మలుపులు, తెరపైకి వచ్చిన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. ఇరు వర్గాలు పట్టుదలకు పోయాయి. చివరకు వైసీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని నియ మించింది. దీంతో.. బాలినేని ప్లేటు ఫిరాయించారు. చెవిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంగోలు ఎంపీ దక్కకుండా చేయా లని డిసైడైన ఆయన… తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే సీటు నుంచి తన కుమారుడు రంగంలో ఉంటాడని చెప్పినట్లుగా తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీనిపైనే తాజాగా సీఎంను కలిసిన బాలినేని అన్ని విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఓసారి ఎంపీ స్థానం చేయి మారితే.. జిల్లాపై పట్టు నిలుపుకోవడం కష్టమని భావిస్తున్న బాలినేని ఈ క్రమంలోనే తానే స్వయంగా రంగంలోకి దిగాలని యోచి స్తున్నట్లు సమాచారం. దీంతో… ఏం చేయాలన్న దానిపై వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొదట్లో జగన్ మాట వింటామని చెప్పినా..కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా…ఆ తర్వాత మెల్లగా స్వరం పెంచి తమదారి తాము చూసుకున్నారు. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆలోచనలో తాడేపల్లి పెద్దలు ఉన్నారన్న వాదన విన్పిస్తోంది.

       ఓవైపు రాజ్యసభ ఎన్నికలు సైతం ముంచుకు వస్తుండడంతో ఇప్పటికే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు గెలవాలంటే అందరి ఎమ్మెల్యేల మద్దతు అవస రం. దీంతో…వారి ఓట్ల కోసం పార్టీ అధిష్టానం ఈ విషయంలో కాస్త వెనకడుగు వేసిందని.. అందుకే వైవీ సుబ్బారెడ్డి ఇక ముందు పెద్ద మార్పులేమీ ఉండబోవంటూ ప్రకటించారని అంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే నేతల్లో వైవీ ఒకరు. ఆయనే ఇలా చెప్పారంటే విషయంలో ఉన్న సీరియస్‌నెస్ గమనించాలని చెబుతున్నారు. మరోవైపు… పెద్దల సభకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కావాలనే ఇలా స్పీడు తగ్గించారని ఇదంతా పక్కా గేమ్ ప్లాన్ అని చెప్పేవాళ్లూ మరికొందరున్నారు. మరి.. వాళ్లమాటా వీళ్లమాటా పక్కన పెడితే వైసీపీ తరఫున ఇంకా జాబితాలు విడుదలవుతాయా లేక ఆగిపోతాయా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్