25.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ఏపీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో టీడీపీ సఫలీకృతమయ్యేనా ?

భలే మంచి ఛాన్స్. అవును ఏపీ ప్రజల్లో ఇప్పుడు ఇదే మాట విన్పిస్తోంది. నిజమే ఎన్డీఏ కూటమి మేజిక్ ఫిగర్ దాటే సినా, బీజేపీకి గతంలో మాదిరిగా సొంతంగా ఫుల్ మెజార్టీ రాకపోవడం భాగస్వామ్య పక్షాలకు లాభంగా మారింది. మరి ఈ అవకాశాన్ని ఎన్డీయేలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ ఏ మేరకు ఉపయోగించు కుంటుంది? రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, గతంలో ఇచ్చిన మేరకు విభజన హామీలను నెరవేర్చాలని తెలుగు దేశం అధినేత పట్టుపడతారా? రాష్ట్రా నికి నిధుల వరద పారిస్తారా? అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?

  దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతగానో ఎదురుచూసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కొన్ని పార్టీలకు ఇష్టం కొన్ని పార్టీలకు కష్టం అన్నట్లుగా వచ్చిన రిజల్ట్స్‌తో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిం చాయి ఆయా కూటములు. అయితే ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు సాధించినా బీజేపీకి సొంతంగా గతంలో మాదిరిగా మేజిక్ ఫిగర్ దాటేలాగా సీట్లు మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కీలక భాగ స్వామ్యపక్షాలుగా ఉన్నాయి. జేడీయూ సంగతి కాస్త పక్కన పెడితే, ఏపీ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే చంద్ర బాబు అవసరం ఎన్డీయేకు అత్యంత కీలకమనే చెప్పాలి.

    నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్‌ సంచలనం సృష్టించారు. కానీ, నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా, అలాగే కూటమి పరంగా అంటే ఏ విధంగా చూసినా భాగస్వామ్యపక్షాల ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి లేదు. ఇది గమనించే ఫలితాలు వచ్చిన రోజే నాడు ఏపీలో పవర్‌లోకి వచ్చిన జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే సీన్ ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. దీంతో విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన పలు హామీలను ఎన్డీఏపై ఒత్తిడి తీసుకు వచ్చి అమలు చేయించే అవకాశం తప్పిపోయింది. కానీ, ఇప్పుడలాకాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. అలాగని ఎన్డీఏ కూటమికి వచ్చినా, కేవలం కొన్ని సీట్లు మాత్రమే మెజార్టీ మార్కుకు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భాగస్వామ్యపక్షాల్లోని మెజార్టీ సీట్లు ఉన్న వాళ్లలో ఎవరికి ఆగ్రహం వచ్చినా ఎన్డీఏ మనుగడ కష్టమని చెప్పక తప్పని పరిస్థితి. ఓవైపు ఇండియా కూటమి సైతం ఎన్డీయే పక్షాల్లో చేరిన టీడీపీ, జేడీ యూ మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ గమనించే ఇప్ప టికే ప్రధాని నరేంద్రమోడీ సైతం భాగస్వామ్యపక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటిం చడం ప్రాధాన్యం సంతరించుకుంది.

   సరిగ్గా ఈ పరిస్థితే ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీయేకు మద్దతిస్తాం మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసిపెట్టండి అని చంద్ర బాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. అయితే ఇదే అంశాన్ని తెలుగు తమ్ముళ్లు సైతం చెబుతున్నారు. గతంలో 1996 టైంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటుతోపాటు ప్రధానులుగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నియామ కాల్లో కీలకంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాటి ప్రధాని వాజ్‌పేయి హయాంలోనూ ఎన్డీయే కన్వీనర్‌గానూ చక్రం తిప్పారు. దీంతో మరోసారి అదే స్థాయిలో మోడీ 3.ఓలోనూ టీడీపీ అధినేత హవా కొనసాగుతుందని, రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు తేవడంలోనూ, నిధులు మంజూరు చేయించ డంలోనూ తాము ముందుంటామని అంటున్నారు.

  టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా చూస్తే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజ నాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవు తుంది. ఇక, ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటే. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తైనా, ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమేలు చేసిన ట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు.సామాన్య ప్రజానీకం లోనూ చర్చ సాగుతోంది.

  ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపో యాయి. ఇప్పుడు టీడీపీ కూటమి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటివరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరుతెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. కేవలం ఇవే కాదు. కడప స్టీల్ ప్లాంట్, నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్, అమరావతి – అనంతపు రం ఆరు వరుసల రహదారి సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అటు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలికగా సాగేది కాదన్న మాట విన్పిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధికి అద్భుతమైన అవకాశం వచ్చిందని, దాన్ని సమర్థంగా వినియోగిం చుకోవాలని కోరుతున్నారు. మరి టీడీపీ అధినేత ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్