28.6 C
Hyderabad
Tuesday, June 3, 2025
spot_img

వాలంటీర్ల రాజీనామాల వెనుక రాజకీయ వ్యూహం ఏమిటి?

ఏపీలో ఎన్నికలవేళ … వాలంటీర్ల వ్యవస్థ పై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీ ర్లను పెన్షన్ వంటి సేవలకు దూరం పెట్టాలని కొరడా ఝుళిపించడంతో వాలంటీర్ల సేవల నియోగంపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్ల సేవల పై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు. ఐదేళ్లుగా వాలంటీర్లుగా సేవలం దించిన వారు ఇప్పుడెందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఎన్నికల తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రాజీనామాకు తమపై వస్తున్న విమర్శలే కారణమా? ..లేదంటే రాజకీయ వ్యూహంలో భాగమా?

2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొ చ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాలలో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు రెండున్నర లక్షల మందిని నియ మించారు. ప్రతినెల 5, 000 రూపాయల జీతంతో తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించడం , లబ్ధిదారులకు అవసరమైన సేవలు అందిం చడం వాలంటీర్ల పని. వైసిపి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత దానిపై రాజకీయ విమర్శలు కూడా మొదల య్యాయి వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకంగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం, ప్రజా ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ, వారిని వైసీపీ పార్టీ కార్యక్ర మాలకు వాడు కుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. మగవాళ్ళు ఇంట్లో లేని సమ యంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ గతంలో చంద్రబాబు చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి.

వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని తెలుసుకుంటోందంటూ పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా తో పాటు, మహిళల పై జరుగుతున్న దాడులకు వాలంటీర్లు ద్వారా వైసీపీ నేతలు సేకరించిన సమాచారమే ప్రధాన కారణం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయన దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై కేసులు కూడా పెట్టారు. వాలంటరీ వ్యవస్త పై ఎన్ని విమర్శలు వచ్చినా ఏపీ సీఎం జగన్ మాత్రం వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలకు సీఎం జగన్ వారిని అనేక సందర్భాల్లో అభినందించారు. అంతే కాకుండా వాలంటీర్లు కు ప్రతి ఏటా వారి సేవలకు గుర్తింపుగా నగదు పురస్కారం అందించారు. ఇక ఏపిలో ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న వాలంటీర్లు ప్రభుత్వ డబ్బుని శాలరీ గా తీసుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు న్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అంతే కాకుండా ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధి దారులకు అందించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులు నుంచి తప్పించడం తో పాటు, ప్రభుత్వ పథకాల పంపిణీకి దూరంగా వుండాలని ఆదేశించింది. ఫలితంగా ప్రతి నెలా వాలంటీర్లు ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీ కి బ్రేక్ పడింది. ఈ అంశాన్ని రాజకీయంగా వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నాయి.

మారిన పరిణామాల నేపథ్యంలో తాజాగా వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. మచిలీపట్నం నియోజక వర్గంలో దాదాపు 1200 మంది రాజీనామా చేశారు. అలాగే తాడిపత్రి లో 300 మందికి పైగా రాజీనామా చేశారు. మిగిలిన జిల్లాలో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. వాలంటీర్ గా ఉంటే… వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది. దీంతో చాలా చోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేసినా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, తిరిగి వారికే వాలంటరీ ఉద్యోగం ఇస్తామని వైసీపీ నేతలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లు సేవలు వాడుకునేందుకు వైసిపి నేతలు రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపిలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ల రాజీనామా అన్ని ప్రధాన పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ వాలంటీర్లు ..మరోలా జరిగితే..ఎలాగూ ఉద్యోగం పోతుందనే భావన చాలామంది వాలంటీర్లలో కన్పి స్తోంది.. రాజీనామాలకు అదే కారణమేమో…

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్