24.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

SLBCలో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి? .. సొరంగంలో రోజుల తరబడి ఆపరేషన్‌

నాలుగు రోజులు గడిచాయి.. నాన్‌స్టాప్‌గా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అయినా.. SLBC సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది కార్మికుల ఆచూకీ మాత్రం తెలియరాలేదు. డే అండ్ నైట్ రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నా.. స్పాట్‌కి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? 40 మీటర్ల దూరంలోనే ఎందుకు ఆగిపోయారు? వాళ్లకు ఎదురవుతున్న ఆటంకాలేంటి?

ఎస్‌ఎల్‌బీసీ ఘటన క్షణం క్షణం ఉత్కంఠను పెంచుతోంది. ఆ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడాలని యావత్ సమాజం ఆకాంక్షిస్తోంది. అయితే, పరిస్థితులు ఊహించినంత సులభంగా లేవు. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలు విజయవంతమవుతాయా లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది.

రోజులు గడుస్తున్నాయి.. రెస్క్యూ ఆపరేషన్‌ సుదీర్ఘంగా కొనసాగుతోంది.. కానీ SLBC టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ మాత్రం కానరావడం లేదు. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సహాయక బృందాలు… నాలుగో రోజు రెస్క్యూలో భాగంగా.. స్పాట్‌కి 40 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రోజుల తరబడి ఆపరేషన్‌ తర్వాత.. 40 మీటర్ల టాస్క్‌.. రెస్క్యూ సిబ్బందికి సవాల్‌ విసురుతోంది. ఆ.. 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారన్నదే … రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. అటువైపు 8 మంది కార్మికులు.. ఇటువైపు సహాయక బృందాలు.. మధ్యలో 40 మీటర్ల మేర శకలాలు, బురద మేట.. వీటిని తొలగిస్తే ఆపరేషన్ క్లైమాక్స్‌కి చేరినట్టే… కార్మికుల జాడ దొరికినట్టే. అయితే ఈ కఠినమైన పరిస్థితిని అధిగమించడం ఎలా అన్నది బిగ్ టాస్క్‌గా కనిపిస్తోంది.

భూగర్భం తవ్వడం మనం అనుకున్నంత ఈజీ కాదు. వ్యయప్రయాసలు ఎన్నో ఉంటాయి. చాలా వరకు రోడ్ల కోసం, నీటి తరలింపు కోసం ఇలా టన్నెల్స్ తవ్వుతుంటారు. ఇప్పుడు SLBCలో ప్రమాదం జరగడంతో అందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. SLBC సొరంగ తవ్వకం పనుల్లో అనుకోని అవాంతరాలు ఎదురై అందులో 8 మంది చిక్కుకొని పోయారు. 14వ కిలోమీటర్ దగ్గర ఉరుము ఉరిమినట్లుగా ఒక్కసారిగా మట్టి, నీటి ఊట కలిసి కూలడంతో అక్కడ పని చేస్తున్న వారు చిక్కుకుపోయారు. అసలేం జరిగిందో చాలా సేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. పైకప్పు నుంచి మట్టి, బురద, నీళ్లు పడడంతో కార్మికులంతా ఎగిరిపడ్డారు. పైపులు, ఇనుపరాడ్లు మీద పడి కార్మికులకు దెబ్బలు తగిలాయి. ముఖమంతా బురద చిమ్మింది. కొద్ది దూరంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికొచ్చారు. 8 మంది మాత్రం ఎక్కడ చిక్కుకున్నారన్నది క్లారిటీ రావడం లేదు. క్షణక్షణం ఆందోళన పెరుగుతోంది.

40 మీటర్ల దూరం దాటి వెళ్లేందుకు సిబ్బందికి మూడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదటిది.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు.. ఇవి మీటర్ల మేర పడిపోయాయి. భారీగా బరువు ఉండటంతో వాటిని బయటకు తీయడం కష్టమవుతోంది. ఇక రెండోది బురద మేట.. నీటి ఉటతో బురద అంతకంతకు పెరుగుతోంది. దాన్నంతా బయటకు తీయడం కూడా ఇబ్బందికరంగానే మారింది. ఇక మూడోది కన్వెయర్ బెల్డ్‌.. 12 కిలోమీటర్ల తర్వాత సిబ్బంది కాలినడకన స్పాట్‌కి వెళ్లేది కన్వెయర్ బెల్ట్‌పైనే. ఇది ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. అయితే.. కళ్ల ముందు జరిగిన ఘటన తల్చుకుంటూ ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు కార్మికులు

40 మీటర్లమేర పేరుకుపోయిన బురద మేట.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు ఎంత వేగంగా బయటకు పంపిస్తే అంత త్వరగా కార్మికుల్ని గుర్తించే వీలుంటుంది. ఈ ప్రక్రియను చాలా త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రెస్క్యూ సిబ్బంది ముందుకెళ్తోంది. మరోవైపు సొరంగంలో కార్మికుల్ని గుర్తించేందుకు స్నీపర్ డాగ్‌, ర్యాట్ హోల్ టీమ్ సేవల్ని ఉపయోగిస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్నా కొద్దీ బాధిత కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా ఎల్‌ఎల్‌బీసీ ప్రాంతానికి చేరుకుని.. తమ వాళ్ల ఆచూకీపై ఆరాతీస్తుండటం గుండెల్లి బరువెక్కిస్తోంది.

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్ నడిస్తేనే కన్వేయర్‌ బెల్టు కూడా నడుస్తుంది. ప్రస్తుతం లోపల సిస్టమ్ అంతా ఆగిపోయింది. మెషిన్ పైనే మట్టి కూలడంతో కన్వేయర్‌ బెల్టు నడవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సొరంగం బయటి నుంచి లోపలికి లోకో ట్రైన్‌ ద్వారా వెళ్తున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల దూరం రావడానికి పోవడానికి గంటా 10 నిమిషాల టైం పడుతోంది. ఈ రూట్ లోనే బురద మట్టిని బయటికి తీసుకురావాల్సి ఉంది. నిర్మాణ వ్యర్థాలు, మట్టి తొలగిస్తేనే అక్కడం ఏం జరిగిందో తెలుస్తుంది. లోపల మేట వేసిన మట్టి, బురదను తొలగించడానికి సింగరేణి సంస్థ నుంచి పరికరాలు తెప్పించాలంటున్నారు.

భూమిని తొలిచే టన్నెల్ బోరింగ్ మెషిన్ దాన్ని తిప్పే కన్సోల్ కు మధ్య 18 మీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో దిగువ భాగంలో 15 అడుగుల లోతు ఉంటుంది. దానిలో నిపుణులు, కార్మికులు పనిచేస్తుంటారు. సిమెంట్‌ సెగ్మెంట్లను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే పైకప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు, బురద, మట్టి కుప్పగా పడ్డాయి. వాటి ఒత్తిడి ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే 9 టన్నుల బరువును మోయగలిగిన సిమెంట్‌ సెగ్మెంట్లు కూడా ముక్కలయ్యాయి. భూమిని తొలిచే బోరింగ్‌ మిషన్ ను లింక్ చేస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్, ఎక్విప్ మెంట్ విడిభాగాలన్నీ భూమిలోకి కుంగిపోయాయి.

డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీటాకి లాంటి సిగ్నల్ ఎక్విప్‌మెంట్స్‌తో సిబ్బంది సొరంగంలోకి వెళ్లింది. దాదాపు 200 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అలాగే నీళ్లు నిలిచి ఉండటంతో రెస్క్యూ సిబ్బంది ముందుకెళ్లలేని పరిస్థితి. సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ విరిగిన భాగాలు, బురదను బయటకు పంపేందుకు సహాయ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్