స్వతంత్ర వెబ్ డెస్క్: వృద్ధురాలిని వాలంటీర్(Volunteer) అత్యంత కిరాతకంగా హత్య చేశాడని.. పిడి గుద్దులు గుద్ది.. కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని జనసేన(Jana Sena) అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అన్నారు. ప్రభుత్వం తరఫున ఒక్క వైసీపీ(YCP) నాయకుడు కూడా పరామర్శించలేదని అన్నారు. విశాఖ నుంచి 151 మంది చిన్నపిల్లలు అదృశ్యమయ్యారన్నారు. ఏపీలో హ్యుమన్ ట్రాఫికింగ్ జరుతుందని నోబెల్ గ్రహీత చెప్పారని పవన్ అన్నారు.
ఆంక్షలు పవన్ కల్యాణ్ కేనా.. ఇలాంటి వారికి లేవా..? అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది విశాఖ నుంచేనన్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఎన్ఓసీ కావాలన్నారు. కానీ వాలంటీర్ ఉద్యోగానికి అవి ఏమీ అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులు పోలీసుల చేతులు కట్టేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.