పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జూలై 1న అమలు చేయనున్న మూడు క్రిమినల్ చట్టాల అమ లును వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పార్లమెంటులో వాటిని మళ్లీ సమీక్షించ డానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్యా చట్టం 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనే మూడు చట్టాల అమలు వాయిదా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలోనే మూడు బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయని మమతా చెప్పారు.