నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా నిజం గెలుస్తుందనే విశ్వాసం ఉందన్నారు. మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశానని చెప్పారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలకు అడ్డూ అదుపు ఉండడం లేదు ఆగ్రహించారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణ రేఖ గీయాలన్నారు. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందనే నమ్మకం ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.