స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ పార్టీ వీడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాను బీజేపీ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు హడావుడి జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ ఏ.చంద్రశేఖర్తో భేటీ కావడం మరింత చర్చనీయంగా మారింది.
ఏ.చంద్ర శేఖర్ ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని, తాము పార్టీ నుండి ఎందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ ఏ,బీ,సీ,డీ వర్గాలకు కట్టుబడి ఉందన్నారు. చంద్ర శేఖర్కు తనకు కామన్ ఎజెండా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దే దించడానికి పని చేస్తున్నామని తెలిపారు. పార్టీ వీడుతున్నారిని విష ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని ఈటల రాజేందర్ అన్నారు.