31.7 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఓటేసిన ప్రముఖ నేతలు

   తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 24.31 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగు తున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తెలంగాణ లో అత్యధికంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్‌ నమోదైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు.

కొడంగల్ జిల్లా లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి, ఆయ‌న భార్య గీత‌, కూతురుతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కొడంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌లో ఓటేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోనీ పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుమారుడు హిమాన్షు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్‌ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ప్రజలందరూ బయటకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటెయ్యాలని సూచిం చారు. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని అన్నారు. సిద్దిపేట లో మాజీమంత్రి హరీష్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్‌ శాతం పెరుగుతోందని.. మేధావులు, విద్యావంతులు పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా స్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు.

హైదరాబాద్ పాతబస్తీలో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెల బోతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి ఓటు వేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించు కున్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు హక్కు విని యోగించుకున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఓటేశారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇదే పోలింగ్‌ కేంద్రంలో కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో సినీనటుడు చిరంజీవి ఓటు హక్కు వినియో గించుకున్నారు. మలక్‌పేటలో త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనా రెడ్డి, మేడ్చల్‌ లో మాజీ మంత్రి మల్లా రెడ్డి, పూడూరులో ఈటల రాజేందర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్