బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళ బురఖా తొలగించి పరిశీలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలతపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రెస్ మీట్ లో రాజకీ య అంశాలు మాట్లాడారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సిఎం రేవంత్ రెడ్డి వాఖ్య లు ఓటర్ల పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని తెలిపారు. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఈసీకి కోరారు.