ఉమ్మడి నెల్లూరు జిల్లా కమ్మవారిపాలెం గ్రామంలో తమ గ్రామం అభివృద్ధి చేయలేదంటూ గ్రామస్తులు ఓట్లు బహి ష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవయ్య 2014, 2019 ఎన్నికల్లో గెలిచి తమ గ్రామానికి అన్నీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, ఓట్లు వేసే వరకు ఒక మాట, వేసిన తర్వాత మరో మాట చెబుతూ తమ గ్రామస్తుల్ని ఎమ్మెల్యే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హామీ ఇస్తే తప్ప తాము ఓట్లు వేయమంటున్నారు గ్రామస్తులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు.