పల్నాడు జిల్లా దాచెపల్లి, గురజాల, సత్తెనపల్లిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. సిట్ డిఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను తెలుసు కుంది సిట్ బృందం. టీడీపీ-వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మాచర్లలో 200 మందిని గురజాల నియోజకవర్గంలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. దాచెపల్లి, గురజాల, సత్తెనపల్లిలో సిట్ అధికారులు పర్యటించనున్నారు.