మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.
భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్టార్ ప్లస్లో మహాభారత సిరీస్కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
విష్ణు మంచు సరసన హీరోయిన్గా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ నటిస్తారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు.
త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తామని మంచు విష్ణు చెప్పారు. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.