27.4 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

విశాఖ పర్యటన.. వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిషరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖకు బయలుదేరతారు. పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు సాయంత్రం 3.50 గంటలకు చేరుకుంటారు. అనంతరరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభింస్తారు. రామ్‌ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంబిస్తారు. ఆ తర్వాత ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం సా. 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పుత్రుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని తిరిగి రాత్రి 8.20 గంటలకు తాడేపల్లికి ప్రయాణమవుతారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్