నారాయణపేట జిల్లా ఉట్కుర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. చిన్నపొర్ల గ్రామంలో భూతగా దాల కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. పొలం దగ్గర దాయాదులు దారుణంగా సంజప్పను కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పట్టపగలే పొలాల మధ్య అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. కొట్టొద్దని మహిళ వేడుకున్నా ఫలితం లేకపోయింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంజప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


