జగిత్యాలలో ఓ ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో ఆటో నడుపుతున్నావంటూ ఆటో డ్రైవర్ భీమరాజంతో ఇద్దరు యువకు లు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి భీమరాజంపై కర్రతో దాడి చేశారు యువకులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాల వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. భీమ రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.


