24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

18 మంది హిందూయేతర ఉద్యోగులపై టీటీడీ చర్యలు

హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు సిద్ధమైంది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు . 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరినప్పుడు చేసిన ప్రమాణాలను విస్మరించి హిందూయేతర పద్దతులను వారు అనుసరిస్తున్నట్టు గుర్తించింది.

హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దేవాలయ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలక మండలి తెలిపింది.

వీఆర్‌ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని ఇటీవల టీటీడీ బోర్డు నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 18న టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీఆర్‌ నాయుడు ఆదేశాల మేరకు హిందూయేతర మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొన్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే టిటిడి నిర్వహించిన హిందూ మత ఉత్సవాలు, పండుగలు కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలపై ప్రభావం చూపిస్తాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఆలయ ఉద్యోగులు ఉద్యోగంలో చేరే ముందు హిందూ మతాన్ని, సంప్రదాయాలను గౌరవిస్తామని వెంకటేశ్వర విగ్రహం లేదా ఫోటో ముందు ప్రమాణం చేయాలని బోర్డు తెలిపింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్