హైదరాబాద్ లో ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో 60 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి సంతోషంగా మ్యాచ్ వీక్షించాలని అభిమానులకు సూచించారు. మరోవైపు మెట్రో అధికారులు కూడా నాగోల్ – అమీర్పేట మెట్రో మార్గంలో కూడా అదనంగా రైళ్లు నడుపుతామని ప్రకటించారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
క్రికెట్ ప్రియులకు శుభవార్త. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ #SunrisersHyderabad Vr. #PunjabKings మధ్య #IPL మ్యాచ్ సందర్భంగా 60 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. అవి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వెళ్తాయి. మ్యాచ్… pic.twitter.com/Vd7yoUhaHK
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 9, 2023