Electric AC buses | ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే ప్రయాణికులకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది. మే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తేనున్నట్లు వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో తెలిపారు. పర్యావరణం రక్షించటం, కాలుష్య నివారణతో పాటు ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు.