36.5 C
Hyderabad
Tuesday, April 29, 2025
spot_img

Minister KTR: కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే

స్వతంత్ర వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి( Ponguleti Srinivasa Reddy) ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌(Thellam Venkatarao) ఈరోజు బీఆర్ఎస్లో(BRS) చేరారు. మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్‌.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

తెల్లం వెంకట్రావు చేరికతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు కాంగ్రెస్ చేశారు. పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావ్  భవిష్యత్ కు మాది భరోసా అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను(Congress) నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అని విమర్శించారు. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరు గమనించాలని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్