24.5 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

వరంగల్ జిల్లా కాట్రపల్లి గ్రామంలో విషాదం

   మొక్కజొన్న చొప్ప మంటలు ఆర్పుతున్న క్రమంలో ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట అనంతరం చొప్పను తగలబెట్టే క్రమంలో వడగాలుల ప్రభావంతో మంటలు పక్కనే ఉన్న భాస్కర్ రెడ్డి పామ్ ఆయిల్ తోటలోకి వ్యాపిం చాయి. అది గమనించిన రైతు మంటలను అదుపు చేయాలని తీవ్రంగా శ్రమించాడు. పొగ నుంచి తప్పించుకోలేక ఊపిరాడక రైతు భగవాన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై మొక్కజొన్న చేనులోనే కాలిన గాయాలతో మృతి చెందాడు. అప్పటికే పొరుగు రైతులు కాలుతూ వ్యాప్తి చెందుతున్న చొప్పను ఆర్పే ప్రయత్నం చేసి సదరు రైతును రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతు భగవాన్ రెడ్డి మృతితో కాట్రపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్