వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరిం చాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు.. వారికి దిశానిర్దేశం చేశారు.
నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం
0
319
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


