30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

తిరుమలలో ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా క్యాలండర్ విడుదల

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో ఆన్ లైన్ లో దర్శన, వసతి గదులు కోటా విడుదలకు సంబంధించి క్యాలండర్ విడుదల చేశారు టీటీడీ అధికారులు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెల 18వ తేది నుంచి 20 వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేస్తారు. 21వ తేదీన నేరుగా వర్చువల్ సేవా టిక్కెట్లతో పాటు నేరుగా బుక్ చేసుకునే సేవా టిక్కెట్లు విడుదల చేస్తారు. 23వ తేదీన శ్రీవాణి, అంగప్రదక్షణం, వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. 24వ తేదీన రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. 25వ తేదీన వసతి గదులు కోటా విడుదల చేస్తారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కర్నాటకలో మ్యాజిక్ నెంబర్ కంటే ఎక్కువ స్థానాలలో గెలవబోతున్నామని అన్నారు. మొదటిసారి పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నట్లు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పేలా ఫలితాలు వుండబోతున్నాయంటూ ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విజయవాడలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో ప్రజలందరు పాల్గొనాలని హితవు పలికారు. ఆలయాల అభివృద్దికి, భక్తుల సౌకర్యాలపైనే దేవాదాయశాఖ దృష్టి పెట్టిందని అన్నారు. సుబ్రహ్మణ్యం స్వామి ఎందుకు అలా వ్యాఖ్యలు చేసారో తెలియదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్