స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో ముగ్గురు గొర్రెలు కాపర్లు మృతి చెందారు. మేకల్ని నేల బావిలో నీళ్లు త్రాగిచ్చే క్రమంలో బావిలో పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. వాళ్ళిద్దర్నీ కాపాడే ప్రయత్నంలో సమీప బంధువు కూడా బావిలో పడి మృతి చెందాడు. మృతులు వేముల నాగార్జున(16), వేముల నాగులు (42), ఆంజనేయులు (50) గా గుర్తించారు.
మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గం హలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో బోలుగోటే బసవేశ్వర స్వామి సమీపంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షత గాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.