స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం నెలకొంది. కల్తీ సారా తాగడంతో అనారోగ్యం బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం జిల్లా మరక్కాణంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ విషాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కల్తీ సారా సేవించి అస్వస్థతకు గురైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు.