ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి కొట్లాటలకు దిగుతున్నారు. రాళ్లు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాల య్యాయి. ఘర్షణలతో సాధారణ ఓటర్లు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ నెలకొంది. తొండపిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల నేతలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.