సర్వత్ర నెలకొన్న ఆసక్తి.. తుమ్మల దారెటో మరి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి జిల్లా కీలక నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) నేడు భారీ బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంకు(Khammam) వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీగా బల ప్రదర్శన చేయనున్నారు.

ఇక  తుమ్మల పాలేరు(Paleru) అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. సీఎం కేసీఆర్‌(CM KCR) విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భంగపడ్డారు.  పాలేరు టికెట్‌ను కందాల ఉపేందర్‌ రెడ్డికి అధిష్టానం కేటాయించడంతో.. పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై అలకబూనారు. రాయబారాలు, బుజ్జగింపులపై అసహనంతో ఉన్న తుమ్మల.. పొలిటికల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు.
కాగా.. తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన.  ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

Latest Articles

బండి సంజయ్‌ను కాదని బీజేపీ ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతోందా?

ఒకప్పుడు సిద్ధాంతాలు, విలువలకే పెద్దపీట వేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు కేవలం అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో కమలం వికసించేందుకు పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహాలను అమలు చేస్తోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్