23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

దేశంలో భగ్గుమంటున్న ఎండలు

    దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయన్న నానుడి దేశంలోని వివిధ ప్రాంతాలవారికి ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. దేశ రాజధానిలో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నిన్న సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే హడలిపో యారు. ఇక ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, బిహార్‌లలో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    వడగాడ్పుల దెబ్బకు ఒక్కరోజులోనే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా రు. వీరిలో మధుమేహులు, బీపీ రోగులు ఎక్కువ. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో జూన్‌ 8 వరకు పలు సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఝార్ఖండ్‌లో ఎండలకు గబ్బిలాలు, ఇతర ప్రాణులు కూడా నేలరాలిపోతున్నాయి. రానున్న రెండ్రోజుల్లో యూపీ, దిల్లీ, చండీగఢ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్