31.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట- టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యంగా గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త తీసుకోకుండా డీఎస్పీ గేట్లు తెరిచినట్టు తెలిసిందన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు.

పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలా రావు.. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యుల బృందంతో ఈవో ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈఓ.
ఘటనలో ఆరుగురు మృతి చెందారని చెప్పారు. 41 మంది గాయపడ్డారని తెలిపారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని చెప్పారు.

భక్తుల ఆరోగ్యం పరిస్థితిని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ వివరించారు. అందరికీ చికిత్స అందిస్తున్నామని.. ముగ్గురు మాత్రం మరో రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుందన్నారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్