డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజాసాబ్లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన ప్రభాస్ ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు రాజాసాబ్లో రాజు పాత్రలో కనిపించబోతుండడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఏచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.