33 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

సినిమా వాళ్లు  చెప్తే వినే స్థాయిలో లేము.. చిరంజీవికి మంత్రి రోజా కౌంటర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: చిరంజీవి (Chiranjeevi) సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు ఆయన తమ్ముడికి ఇవ్వాలని మంత్రి రోజా సూచించారు. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని మంత్రి రోజా (Minister Roja) హితవు పలికారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా (Special Package) కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. పార్టీ విలీనం చేసినప్పుడు చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు  చెప్తే వినే స్థాయిలో లేమని అన్నారు.

బుధవారం తిరుపతిలో రోజా మాట్లాడుతూ.. చిరంజీవి, పవన్‌పై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. గడపగడపకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎన్ని రోడ్లు వేశామోనని పేర్కొన్నారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్‌ ధర పెంచమని అడిగారని ప్రశ్నించారు. హీరోలందరూ సీఎం జగన్‌(CM Jagan) దగ్గరకు ఎందుకెళ్లారని నిలదీశారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని  విమర్శించడం లేదని అన్నారు.  రాష్ట్రం విడిపోతే చిరంజీవి ఏం చేశారని, హోదా గురించి అప్పుడెందుకు అడగలేదని ప్రశ్నించారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్