24.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కేరళలోని 32వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి ఎలా మారారనే అంశం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. యువతులను ట్రాప్ చేసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేర్చారంటూ తీసిన ఈ సినిమాను నిషేధించాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ, హిందూ సంస్థలు మాత్రం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలని చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్