20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఎలివేటర్‌లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్‌లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్