స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి ఎనిమిదో సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్తో సాగుతున్న ఈ సమావేశంలో దేశ ప్రజల ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలికసదుపాయల వృద్ధి వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నారాయణ్ రాణె, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలు ఈ భేటీకి హాజరుకావట్లేదని ప్రకటించారు.


