విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీనటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 పేరుతో అవార్డులను అందిస్తున్నారు. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం హైదరాబాద్లోని హోటల్ “దసపల్లాలో ఈ నెల 29న జరగనుంది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి రావడానికి మంత్రి కోమటిరెడ్డి అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు.


