31.1 C
Hyderabad
Thursday, June 12, 2025
spot_img

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. సంస్కరణలు అనేది నిరంతర ప్రక్రియ అని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుండి కొత్త కొత్త సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని వ్యాఖ్యానించారు. రెండేళ్లు కరోనా అతలకుతలం చేసింది, అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పటినుంచో ఉంది, జిల్లాను ఏర్పాటు చేసుకోవడమే కాదు.. నూతన కలెక్టరేట్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందిని అన్నారు.

వెనుకబడిన సామాజిక వర్గాన్ని ఆదుకోవడం కోసమే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాం. గొర్రెల పెంపకం తెలంగాణలో అద్భుతంగా కొనసాగుతోంది. మంచిర్యాల నుండే రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాం. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా అంశాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్లో దాటేసి నెంబర్.1 స్థానంలో తెలంగాణ నిలిచిందని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్