కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శలు గుప్పించారు.కర్నాటక(Karnataka)లో కాంగ్రెస్ను బలహీన పర్చేందుకు సీఎం కేసీఆర్(KCR) విశ్వ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కర్నాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను ఏలాలని సీఎం చూస్తున్నారని మండిపడ్డారు. తనతో సత్సంబధాలతో ఉన్నవాళ్లుకు కేసీఆర్ భూములు పంచుతున్నారని అన్నారు. జడీఎస్ ద్వారా కాంగ్రెస్ ను ఓడించి తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం సీఎం చేస్తున్నారని అన్నారు.