30.7 C
Hyderabad
Friday, June 9, 2023

రాహుల్‌పై అనర్హత వేటు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: KCR

CM KCR: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. సీఎం మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ప్రధాని మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయం అని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని మండిపడ్డారు.

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును మంత్రి కేటీఆర్ ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అత్యంత అప్రజాస్వామికమని.. అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని వక్రీకరించడమేనని అన్నారు. బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్