16.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చింది- మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చిందని తెలిపారు. దీని ద్వారా రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నగరంలో ఆర్టీసీ బస్సులు.. ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారన్నారు. ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఈటొ మోటర్స్ ఫ్లిక్స్ బస్, ఎలక్ట్రిక్ బస్సు మొదటిసారి ప్రారంభించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించిన అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్