13.7 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

నేడు రేపల్లెకి టీడీపీ అధినేత చంద్రబాబు

స్వతంత్ర వెబ్ డెస్క్: చెరుకుపల్లి మండలం ఉప్పాల వారి పాలెం గ్రామంలో మృతి చెందిన ఉప్పాల అమర్నాథ్ కు నివాళులర్పించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ఉప్పాలవారిపాలెం వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద పాము వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులు ముగ్గురు కలిసి ట్యూషన్‌కు వెళుతున్న అమర్‌నాథ్‌ను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరగాలని, నేరస్థులకు శిక్ష పడాలని శనివారం రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ రాస్తారోకో నిర్వహించారు. హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నేరస్థులకు శిక్ష పడే వరకు తాము పోరాడతామని తెలిపారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్