టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి భద్రత తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రవికి ఉన్న వన్ ప్లస్ వన్.. గన్ మెన్లను ఉపసంహరిస్తూ కడప జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. గన్ మన్ల ఉపసంహరణపై బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తానని తెలిపారు. అయితే వివేకా హత్య కేసు తాజా పరిణామాల నేపథ్యంలో బీటెక్ రవి భద్రత తొలగించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే బీటెక్ రవి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కావడంతో పాటు పులివెందుల నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.