24.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

చంద్రబాబుపై రాళ్ల దాడి.. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఫిర్యాదు చేశారు. వీవీఐపీ భద్రత పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని.. సంఘ విద్రోహ శక్తులతో పోలీసులు కలిసి పనిచేయడంపై విచారణ జరిపించాలని ఫిర్యాదు లేఖలో విజ్ఞప్తి చేశారు.

యర్రగొండపాలెం ఘటనతో పాటు గతంలో చంద్రబాబుపై జరిగిన సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఆందోళనకారులు దాడికి ముందుగానే సిద్ధమైనా చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీనారాయణ కోరారు.

మరోవైపు యర్రగొండపాలెం ఘటనను టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. నేతలతో మాట్లాడిన చంద్రబాబు ఈ ఘటనకు గవర్నర్ కు ఫిర్యాదుచేయాలని సూచించారు. ఇప్పటికే కొన్ని వీడియోలను ఈమెయిల్ ద్వారా రాజ్ భవన్ కు పంపించినట్లు తెలుస్తోంది. అటు రాళ్ల దాడి ఘటనలో NSG కమాండెంట్ కు గాయాలవ్వడంతో NSG హెడ్ క్వార్టర్స్ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్థానిక భద్రతాధికారులను
ఆదేశించింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్