33.9 C
Hyderabad
Saturday, May 3, 2025
spot_img

సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ ఈ రాష్ట్ర అధినేతను మాత్రం కలవలేమని వ్యాఖ్యానించారు. అందుకే ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరదూరంగా ఉంటున్నాయని తెలిపారు. అంతేకాకుండా కొంతమంది నేతలు మాటలు చెబుతారే కానీ పని చేయరని పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి అంటే ఒక్క ఫ్యామిలీ మాత్రమే బాగుపడడం కాదని రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళిసై వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్